సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పిఆర్సి కమిటీ వేయాలని, విద్యారంగంలో కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించి,కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఖాళీగా ఉన్న ఐదువేల పైచిలుకు హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని పలు డిమాండ్స్ పరిష్కారం కై ఈరోజు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చేపట్టిన మహా ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సంఘీభావం తెలిపారు, ఆయా డిమాండ్స్ పరిష్కారంకై భవిష్యత్తులో ఉపాధ్యాయులు చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో సిపిఎం పార్టీ మద్దతు ఉంటుందని తెలియజేసారు. ధర్నాకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం సంఘీభావం తెలిపారు
-----------------------
Admin