సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ / తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా సుజాతనగర్ గ్రామపంచాయతీ నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి డంపింగ్ యార్డ్ వరకు గ్రామంచాయతీ ట్రాక్టర్లు, ట్రాలీ లను సుందరంగా అలంకరించి , తెలంగాణ పాటలతో సుమారు 450 మందితో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పల్లె ప్రకృతి వనం సందర్శించి అనంతరం మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ గావించి , పల్లె ప్రగతి నందు సాధించిన విజయాలపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించబడింది. గ్రామ సభ అంతరం గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు శానిటేషన్ సిబ్బందికి ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను శాలువా మరియు ప్రశంసా పత్రాలతో సన్మానించి అనంతరం వారికి డ్రెస్ కోడ్ మరియు బూట్లు , గ్లౌజ్ లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీ ఖాజా మోహినుద్దీన్ ఖాన్ , ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి పెద్దమల్ల శోభారాణి, బత్తుల మానస , వార్డు సభ్యులు గూని వీర భద్ర రావు, గడ్డం లక్ష్మణ్ రావు , శ్రీ నడికట్టు జయరామిరెడ్డి , పంచాయతీ కార్యదర్శి బోగా నరేంద్ర ప్రసాద్ గారు వివిధ స్థాయిల అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు హాజరు కావడం జరిగింది
-----------------------
Admin