సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు మండలం కొండకమర్ల గ్రామంలో లో నీ ప్రాథమిక పాఠశాల 2 మహాత్మ జ్యోతిరావు పూలే ఘనంగా నిర్వహించారు. సమసమాజ స్థాపకులు, అణగారిన వర్గాల ఆశా జ్యోతి,విద్యా, సమాజాభివృద్ధికి అశేష కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ఉపాధ్యాయ సంఘనాయకులు గౌస్ లాజమ్ కొనియాడారు. మహాత్మా జ్యోతి రావ్ ఫూలే 197 వ జయంతి సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడుతూ.. "సమాజంలోని కులపరమైన వివక్షను , అన్యాయాలను రూపుమాపడానికి, వెనుకబడిన కులాల అభ్యున్నతికి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు, సామాజిక ఉద్యమకారులు, మార్గదర్శి జ్యోతిరావు పూలే అని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన కోసం పునరంకితం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణ, నాగరాజు,వెంకట చలమయ్య, చంద్రకళ, (సి ఆర్ పి )నరసింహులుతదితరులు పాల్గొన్నారు. ఫూలే జయంతి సందర్భంగా ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు తెలిపారు.మజ్జిగ పంపిణీ చేసిన గౌస్ లాజమ్ కు అభినందించారు...
-----------------------
Admin