సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని పాత దొనబండతండ గ్రామపంచాయతీలో మండల ఎంపీపీ పార్వతి కొండా నాయక్ గారు ప్రభుత్వ పాఠశాలను మరియు అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్లో హాజరు శాతం పెంచాలని, మండలంలోని కొన్ని పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు కావాలని, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో వసతులపై అవగాహాన కల్పించకుండా, కొన్ని పాఠశాలలు మూతపడ్డే విధంగా చేస్తున్నారని తెలిపారు. అలాగే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధించాలని తెలిపారు. అనంతరం అంగన్వాడి కేంద్రం వద్ద డైలీ పిల్లలకు పెట్టే మెనూ అలాగే హాజరు పట్టికను తనిఖీ చేశారు. రోజు పిల్లలకు పౌష్టికారమైన హారపదార్థాలను మెనూ ప్రకారం పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానకి రాములు, ఏ పి ఓ ఆంజనేయులు, కార్యదర్శి నరేష్ ,ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin