సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీ ప్రకారము సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానము నే కొనసాగించాలి అని వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈరోజు మిర్యాలగూడ లో ఉపాధ్యాయ ,అధ్యాపకులను కలిసి ఓట్లను అభ్యర్థించినారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రుల కమిటీని వేసిన ఇప్పటికీ పరిష్కారం ఖాళీదన్నారు టీచర్లు తమ అవసరాల కోసం పెట్టుకున్న జిపిఎఫ్, జిఐఎస్ లోన్లు , సరెండర్ లీవులు బిల్లులు గత ఏడాది నుంచి పెండింగ్లో ఉన్నవి, పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులకు రావలసిన బెనిఫిట్స్ వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగ విరమణ వయసు పెంచే ఆలోచనను విరివించు కోవాలి. నన్ను శాసనమండలికి గెలిపిస్తే అన్ని యజ మాన్యాలు ఎయిడెడ్ మోడల్ స్కూల్స్ గురుకుల కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో పద్దు ద్వారా వేతనాలు చెల్లింపులు జరుపుటకు , సమస్యలు ఎప్పటికప్పుడు పరి ష్కారము నకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు లావూరి క్రాంతి కుమార్. సత్య ప్రకాష్ నాయుడు, పి జానయ్య తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin