సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఇంటి స్థలాలు కావాలని న్యాయబద్ధమైన కోర్కెలతో మీడియా ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించడం దారుణమైన విషయంగా ఏపియుడ్బ్లుజే, ఐజేయు నాయకులు శ్రీనివాసులు, బాబు,మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. గురువారం వారు ఇంటిస్థలాలు కోసం 4వ రోజు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న మీడియా ప్రతినిధులకు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. అనంతరం తహశీల్దార్ రామనాథరెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వున్న పాత్రికేయుల సమస్యలపై పోరాడడానికి భవిష్యత్ లో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 25 వేలమందికి ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇళ్ళ నిర్మాణాలు చేశామని చెపుతున్న ఎమ్మెల్యే కేవలం 8 మంది పాత్రికేయులకు 5 సెంట్లు చొప్పున ఇంటి స్థలం మంజూరు చేయకపోవడం బాధాకరం అన్నారు. కార్యక్రమంలో సీనియర్ మీడియా ప్రతినిధులు మురళి, సంతోష రెడ్డి,మహేష్, షాజహాన భాష, ఫిరోజ్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin