సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని రైటర్ బస్తి ప్రాంతంలో గల ఆర్టీసీ బస్టాండ్ వెనుక ప్రాంతంలోని గణేష్ టెంపుల్ కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ చెందిన స్థలాన్ని స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి మరికొంతమంది తో కలిసి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని అతని పై చర్యలు తీసుకుని దేవాలయ స్థలాన్ని కాపాడాలని కొత్తగూడెం 1టౌన్ పోలీసు స్టేషన్లో ఆలయ కమిటీ మరియు పాలకవర్గం చెందిన వారు ఫిర్యాదు చేశారు. ఈయొక్క సింగరేణి స్థలాన్ని 1982 లో ప్రభుత్వం జీఓ విడుదల చేసి దేవాలయానికి అప్పజెప్పిందని, అప్పటి నుండి స్థలం దేవాలయం ఆధీనంలో ఉండగా కొంతకాలం క్రింతం ప్రహరీ గోడ కూలడంతో గోడ నిర్మించడానికి వస్తున్న ప్రతి సారి స్థానికంగా ఉండే ప్రేమ్ అనే వ్యక్తి అడ్డు పడుతున్నాడాని అన్నారు. ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే ను కూడా కలిసి దేవాలయం స్థలం కాపాడాలని తెలిపామని అన్నారు.
-----------------------
Admin