సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఈనెల 25న కదిరి నియోజకవర్గం లో కదిరి పట్టణం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు దుశ్చర్యల వల్ల రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ మెంబెర్ పర్వీన్ భాను,మహిళలపై తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై చితక బాధడం తో వారిని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ , జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, వాల్మీకి సాధికారిక రాష్ట్ర కన్వీనర్ పూల నాగరాజు, బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు రంగయ్య . అనంతరం మీడియాతో సవితమ్మ మాట్లాడుతూ కదిరిలో కందికుంట ప్రసాద్ ని ఎదురుకోలేక వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహాయంతో ప్రజలను ,టీడీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించి భయభ్రాంతులను గురి చేస్తున్నారు.కదిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ మధును తక్షణమే సస్పెండ్ చేయాలి. మహిళా కౌన్సిలర్ ను, మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడిన సిఐ మధు వెంటనే క్షమాపణ చెప్పాలి . 2024 వచ్చే ఎన్నికలలో మహిళలే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ ఈ కార్యక్రమంలో బండారు మనోహర్ నాయుడు, అడదాకుల పల్లి మాజీ సర్పంచి ప్రసాద్ ,మావు టూరు గోపాల్ త్రివేంద్ర నాయుడు, ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంజునాథ్, రామ్మోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin