Sunday, 26 July 2026 06:04:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాల్కొండ రైతు వేదికలో ఆయిల్ పామ్ పంట సాగు పై అవగాహన సదస్సు...

Date : 06 December 2022 12:22 AM Views : 364

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాల్కొండ రైతు వేదికలో బాల్కొండ గ్రామానికి సంబంధించిన రైతులకు ఉద్యానవన వ్యవసాయ ఉపాధి హామీ పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఆయిల్ పాం పంట సాగుపై అవగాహన సమావేశాన్ని నిర్వహించడం జరిగినట్లు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగు కొరకు ఎస్సీ, ఎస్టీలకు 100% రాయితీ సన్న కారు చిన్న రైతులకు 90 శాతం రాయితీ, ఇతర రైతులకు 80 శాతం రాయితీపై మొక్కలను మరియు డ్రిప్పును అందజేస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ పండించే రైతులకు అంతర్ పంటల సాగు కింద రైతులకు ప్రత్యేకంగా రాయితీని ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వము ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుకోవడానికి గుంతలు తీయడానికి నీరు పోసి కాపాడుకునే దానికి ఉపాధి హామీ ద్వారా మొక్కకు ఆర్థిక సహాయం చేస్తుందని ఏపీవో ఇందిర గారు తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారి రోహిత్ మాట్లాడుతూ పామాయిల్ పంట సాగు తో ఎకరానికి నికరంగా లక్ష రూపాయల ఆదాయాన్ని సంవత్సరానికి పొందవచ్చని తెలిపారు ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకొని ఆయిల్ పామ్ పంట సాగుతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. పీఎం కిసాన్ ఈ కేవైసీ ద్వారా నగదు పొందుతున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూసా సునీత నరహరి, లింగాగౌడ్, గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్ అన్న పోశెట్టి, సొసైటీ వైస్ చైర్మన్ వేంపల్లి బాలరాజు, ఏఈఓ కృష్ణవేణి, గ్రామ సెక్రెటరీ నరసయ్య, రైతులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: