సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండల్ దేశాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని విడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన దేశాయిపల్లి సోషల్ మీడియా ఇన్చార్జ్ ఇమ్మడి పవన్ కళ్యాణ్ ఒక నెల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరిక విధ్వంసం నుండి వికాసం వైపు ఎదురుచూస్తున్న వైనం లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మభ్య పెట్టిన మాటలు విని కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశామంటున కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓట్లు వేయించు కోవడానికి గ్రామంలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఇందిరమ్మ ఇండ్ల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ లోకి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి లాగుతున్న తీరు.ఈ సందర్భంగా స్వప్న సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలకు బుద్ధి చెప్పాలి.ఆనాటి కెసిఆర్ గారి నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గం తెచ్చిన నిధులను ప్రస్తుత ఎమ్మెల్యే మాధవ రెడ్డి గారు అన్ని పనులను రద్దు చేయడం జరిగినది 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి పనులు మొదలుపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా అందించ లేక తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలను అరిగోసలు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పనిచేస్తున్న పోలీసు అధికారులు బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో ఇరు పార్టీలకు బుద్ధి చెప్పాలని స్వప్న సుదర్శన్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో దేశాయిపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుడుతాల రాజీరు , బిఆర్ఎస్ నాయకులు , చల్ల కిషన్, బుసారి రమేష్, కొల్లూరి రాజు , బొమ్మెన మోహన్, మాజీ ఉపసర్పంచ్ బట్టు అరుణ రవి , మాజీ సర్పంచ్ నల్లబెల్లి శోభన్ బాబు తదితరులు పాల్గొనడం జరిగినది.
-----------------------
Admin