Sunday, 26 July 2026 09:58:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామపంచాయతీ సిబ్బంది నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి... - సిఐటియు జిల్లా సభ్యులు రణమియా

Date : 16 July 2023 05:21 AM Views : 406

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో తొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందులను వెంటనే ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా సభ్యులు సయ్యద్ రణమియా డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9 రోజుల నుంచి గ్రామ పంచాయతీ కార్మిక బిడ్డలు,స్వీపర్లు, బిల్ కలెక్టర్లు, కారో బార్లు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారని వారి న్యాయమైన డిమాండ్లు వారిని వెంటనేపర్మినెంట్ చేయాలని, స్వీపర్లకు కనీస వేతనం 15500/- కారో బార్లు, ఎలక్ట్రిషన్లు డ్రైవర్లు బిల్ కలెక్టర్ లకు కనీస వేతనం19500/- చెల్లించాలని జీవో 51 సవరించాలని పని విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగస్తులకు ప్రమాద ప్రమాద భీమ 10 లక్షలు ఇవ్వాలని , 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని , పిఎఫ్, ఈ ఎస్ ఐ గ్రాట్యూటీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ట్రాక్టర్ డ్రైవర్లకు పంచాయతీల ద్వారానే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలని , అక్రమ తొలగింపులు, కార్మికులపై వేధింపులను అరికట్టాలని , సుమారు 17 డిమాండ్ల పై వారు చేస్తున్న పోరాటానికి , సిఐటియు కార్మిక సంఘం, గ్రామపంచాయతీ సిబ్బందులు తలపెట్టిన సమ్మె విజయవంతం అయ్యేంతవరకు అన్నివేళలా అండగా ఉంటుందని, వారి వెంట ఉండి వారికి అన్ని విధాల సహసకర అందిస్తూ పోరాటంలో ముందు ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామపంచాయతీ కార్మిక అధ్యక్షులు ఇంటి రవి, ఉపాధ్యక్షులు మోతిలాల్, ప్రధాన కార్యదర్శి మంగళ పల్లి మైసయ్య, మేడి దేవదానం, గురువా రెడ్డి, వెంకటయ్య, బొందయ్య ,దావీదు సంతోషం, కోటేశ్వరి, సైదా ,వీరస్వామి బాలాజీ, నరసింహారెడ్డి ,బి వెంకటేశ్వర్లు, నాగయ్య ,నాగలక్ష్మి ,పాండు ,మీసాల నాగబాబు ,అమిద్ ,అంజి, బరి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :