సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఏటూరునాగారం : ప్లాస్టిక్ రహితం - పర్యావరణ హితం, పరిశుభ్రరత మేడారం మహా జాతర- 2024 నిర్వహణ కొరకు* ITDA ఏటూరునాగారం ఆధ్వర్యంలో 200 గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తో నిర్వహిచిన ర్యాలీ కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క హాజరై, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మేడారం కు వచ్చే భక్తులందరూ ప్లాస్టిక్ రహిత సంచులను, అనగా కాటన్ సంచులను మాత్రమే ఉపయోగించాలని సమాజంలో ఉన్నటువంటి వన్యప్రాణులకు, ప్రజలకు గాని హాని కలిగించేటటువంటి ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరనైనది. అలాగే ఈ యొక్క మేడారం జాతర ప్లాస్టిక్ రహిత జాతరగా విజయవంతంగా నిర్వహించుటకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరు ఈ యొక్క సమాచారాన్ని ప్రజలకు అందరికీ అదేవిధంగా చూడాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , ఐఏఎస్, అంకిత్, ఐఏఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటిడిఏ ఎటుర్ నాగారం, శ్రీజ ఐఏఎస్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) తో కలిసి గుడి ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది... 24 లక్షలు విలువగలిగిన ఫుడ్ ట్రక్ వాహనాలను పారంభం ఈ యొక్క ర్యాలీ అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో MSME పథకం ద్వారా రెండు గిరిజన JLG లకు 24 లక్షలు విలువగలిగిన ఫుడ్ ట్రక్ వాహనాలను మంత్రి M. Hanumantharao డైరెక్టర్ పంచాయతీరాజ్, కలెక్టర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటిడిఏ , అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) తో కలిసి ప్రారంభించి JLG సభ్యులకు అందజేయడం జరిగింది. (1.శ్రీ సమ్మక్క సారక్క జాయింట్ లేబిలిటీ గ్రూప్, ఎక్కేలా గ్రామము ఏటూరునాగారం మండలం . 2. రాజరాజేశ్వరి గిరిజన జాయింట్ లేబిలిటీ గ్రూప్ పసరా నగరం, గోవిందరావుపేట మండలం ).
-----------------------
Admin