సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / కాలనీలో అసాంఘిక పనులు చేస్తూ మత విద్వేషాలు సృష్టిస్తున్న హరి భూషణ్ అనే వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని సీఎస్ కే విల్లాస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి మున్సిపల్ కౌన్సిలర్ శ్రావణి పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షాద్ నగర్ మున్సిపాలిటీ లో ఉన్న సి ఎస్ కే గ్రీన్ విల్లాస్ లోని విల్లా నెంబర్ 622 లో నివసిస్తున్న హరి భూషణ్ అనే వ్యక్తి కాలనీల్లో ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా చెట్లను సైతం నరికివేయడం జరుగుతుందని అన్నారు. ఈ విషయమై తాము ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా తన భర్తపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ఒక ప్రజా ప్రతినిధిగా కాలనీలో అభివృద్ధి పనులను సైతం చేయలేక పోతున్నట్లు తెలిపారు. హరి భూషణ్ అనే వ్యక్తికి కొంతమంది బీజేపీ నాయకులు సహకరిస్తూ మత విద్వేషాలకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో తమ పై తప్పుడు ప్రచారం చేస్తూనందుకు, ఒక రిపోర్టర్ తో పాటు మరి కొందరిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులకు పిర్యాదు చేసిన వారిలో కాలనీ సభ్యులు పలువురు వున్నారు.
-----------------------
Admin