సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాయినిగూడెం / ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాయని గూడెంలో పి ఎ సి ఎస్ పాలకవర్గ సమావేశం నిర్వహించారు .ఈమధ్య జరిగిన క్యాష్ కౌంటర్ లో దొంగతనానికి బాధ్యులైన క్యాషియర్ బాదె గోపాలకృష్ణ, సెక్రటరీ కాట్రేవుల లక్ష్మాయ్య ఇద్దర్నీ పాలకవర్గ సభ్యులు సస్పెండ్ చేయడం జరిగినది. దీనిలో భాగంగా క్యాషియర్ వద్ద నుండి దొంగతనానికి గురైన అమౌంట్ ని కట్టించడం జరిగింది. కౌంటర్లో ఉన్న క్యాష్ ను లాకర్ లో పెట్టుకోవాల్సిన బాధ్యత లేకుండా ఉండటం వలన క్యాషియర్ ను మరియు జాయింట్ కస్టడీలో ఉండవలసిన నగదును కేవలం క్యాషియర్ కు వదిలేసి విధులు పట్ల నిర్లక్ష్యంగా వహించిన సెక్రటరీ లక్ష్మయ్య ను పాలకవర్గ సభ్యులు సస్పెండ్ చేసినారు.అదేవిధముగా సoఘ కార్యకలాపాలు యదా విధిగా నిర్వహణ కొరకు తాత్కాలిక సంఘ కార్యదర్శిగా నిడిగొండ కనకయ్య ను క్యాషియర్ గా పాలెల్లి అంజయ్య ను నియమించారు. రైతులకి అన్యాయం జరిగే విషయంలో ఎటువంటి విషయాల కూడా సహించమని, అదేవిధముగా వారి యొక్క సేవలే ముఖ్యంగా మా కమిటీ పని చేస్తుందని చైర్మన్ ముప్పారపు రామయ్య తెలియజేసారు.
-----------------------
Admin