సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు మఠంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణ సర్వసభ్య సమావేశం మఠంపల్లి ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఎంపీపీ తో పాటు జడ్పిటిసి జగన్ నాయక్ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఉత్సవాల రోజువారి కార్యక్రమాల షెడ్యూల్ ను సీఎం కేసీఆర్ ... సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో జరిగిన సమీక్ష సమావేశంలో కరాటే చేశారు. 21 రోజుల పాటు జరిగే రోజువారి దశాబ్ది ఉత్సవాలను,ప్రజా ప్రతినిధులు విధిగా హాజరై, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రోజువారి షెడ్యూల్ జూన్ 2వ తేదీ శుక్రవారం ప్రారంభోత్సవాలు, జూన్3వ తేదీ శనివారం తెలంగాణ రైతు దినోత్సవం, జూన్ 4వ తేదీ ఆదివారం సురక్ష దినోత్సవం, జూన్ 5వ తేదీ సోమవారం తెలంగాణ విద్యుత్ దినోత్సవం, జూన్ 6వ తేదీ మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, జూన్ 7వ తేదీ బుధవారం సాగునీటి దినోత్సవం, జూన్ 9 వ తేదీ గురువారం ఊరూరా చెరువుల పండగ, జూన్ 9వ తేదీ శుక్రవారం తెలంగాణ సంక్షేమ సంబరాలు, జూన్ 10వ తేదీ శనివారం సుపరిపాలన దినోత్సవం, జూన్ 11వ తేదీ ఆదివారం తెలంగాణ సాహిత్య దినోత్సవం, జూన్ 12వ తేదీ సోమవారం తెలంగాణ రన్, జూన్ 13వ తేదీ మంగళవారం తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం, జూన్ 14వ తేదీ బుధవారం తెలంగాణ విద్యుత్ దినోత్సవం, జూన్ 15వ తేదీ గురువారం పల్లె ప్రగతి దినోత్సవం, జూన్ 16వ తేదీ శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం, జూన్ 17వ తేదీ శనివారం తెలంగాణ గిరిజనోత్సవం, జూన్ 18వ తేదీ ఆదివారం మంచినీళ్ల పండుగ, జూన్ 19వ తేదీ సోమవారం హరితోత్సవం, జూన్ 20వ తేదీ మంగళవారం తెలంగాణ విద్యా దినోత్సవ, జూన్ 21వ తేదీ బుధవారం తెలంగాణ ఆధ్యాత్మికత, జూన్ 22వ తేదీ గురువారం అమరుల సంస్మరణ ఇట్టి కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సాయి గౌడ్ , ఎంపీడీవో జానకి రామలు స్పెషల్ ఆఫీసర్ సంధ్యారాణి, ఎంపీ ఓ ఆంజనేయులు , ఏపి ఎం, ఐసిడిఎస్ , ఎల్ సి టి ఐ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డి ఈ కార్యదర్శులు, అన్ని డిపార్ట్మెంట్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin