సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చిలుకూరు మండలంలోని బేతవల గ్రామంలో దసరా పండుగ సందర్భంగా కనకదుర్గమ్మ గుడి దగ్గర జరిగిన గొడవలో పిటిషన్ లో పేర్లు లేని మహిళలను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం అన్యాయం అంటూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల నాయకులు వంగూరి రమేష్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా కనకదుర్గమ్మ గుడి దగ్గర జరిగినటువంటి గొడవలో గొడవకు సంబంధంలేని, కనీసం పిటిషన్ లో పేర్లు లేని మహిళలను అరెస్టు చేసి పంపించడం అన్యాయమని, అందులోనూ వృద్ధ మహిళ అని చూడకుండా నిర్దాక్షణ్యంగా జైలుకు పంపించడం సరి కాదని, 12వ తారీకు రోజున రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో ఇచ్చిన పిటిషన్ కాకుండా 13వ తారీకు మధ్యాహ్నం సమయంలో మరో పిటిషన్ పై బలవంతంగా సంతకo చేయించి కేసులు చేయడం అన్యాయం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నమోదు అయిన వ్యక్తులైన వట్టికూటి నాగయ్య మరియు అతని అనుచరులు స్వేచ్ఛగా గ్రామంలో తిరుగుతూ, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. తక్షణమే వారిని అరెస్టు చేసి జైలుకు పంపించాలి లేనియెడల ఉద్యమాలు ఉధృతం చేస్తామని, గ్రామంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ఇప్పటికైనా పోలీసులు తక్షణ చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేడపంగు వీరయ్య,నారకట్ల గోపి, వంగూరి రాంబాబు, నెమ్మది రవి, నవీన్, రేమిడాల వీరయ్య, రేమిడాల వెంకటి, జ్యోతి, నారాయణ,తిరపయ్య, బాబు,సురేష్,సోమయ్య తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin