సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక సిపిఐ ఆఫీస్ లో మండల కార్యవర్గ సమావేశం ముదిగొండ బాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, సారెడ్డి పుల్లారెడ్డి హాజరై వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేయాలని,మరియు శాఖ సమావేశాలు వెంటనే జరిపించి బూత్ కమిటీలు వేయాలని కోరారు.బూత్ కమిటీల్లో ఎన్నుకున్న వారికి నియోజకవర్గంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఉంటుందిఅని తెలిపారు. దానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరయ్యేలా చూడాలని అన్నారు.మరియు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులతో పాటు గిరిజనేతర పోడు సాగు చేసుకుంటున్న పేదలకు కూడా పట్టాలు ఇవ్వాలి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలి అన్నారు. పేదల పక్షాన పేదలకు న్యాయం జరిగే వరకూ సిపిఐ పార్టీ అండగా ఉండాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరావు( లడ్డ) మండల సీనియర్ నాయకులు అలవాల సీతారాంరెడ్డి, పేరాల శ్రీనివాసరావు,సబ్కం నాగేశ్వరావు,పాండవుల బిక్షం, మల్సూర్,బాలకృష్ణ, భూక్య శ్రీను,జహీర్,మల్సూర్,మహిళా సంఘం నాయకురాలు పిచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin