సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకీడు : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు పాలకవీడు మండల కేంద్రంలొ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కిష్ఠపాటి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ విద్యుత్తు రద్దు చేయాలనీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విచక్షణ లేనివనీ,తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్ కక్ష కట్టిందని మండిపడ్డారు.70 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని విమర్శించారు.దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదగాలని 24 గంటల ఉచిత కరెంటు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉండేదని.ఇప్పుడు స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారని వెల్లడించారు.కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రైతులకు భరోసగా రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ భారత దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం అని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు.మొదటినుంచి కాంగ్రెస్ కు రైతులంటే చిన్న చూపే అని, మొన్న ధరణి వద్దన్నారు ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని రైతులపై కక్ష సాధింపు చర్య అని అన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్మెయిలర్,ఒక చీటర్ ఐదు నిమిషాలలో భూమి రిజిస్ట్రేషన్ అవుతున్న ధరణి పోర్టర్ కూడా వద్దంటున్నారు.రైతులతో పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వమే గద్దె దిగే పరిస్థితి వచ్చిందనీ , తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, తెలంగాణ రైతులంతా కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడగొట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కోరారు.ఈకార్యక్రమంలో మండలనాయకులు ఆయా గ్రామాల సర్పంచ్లు ,ఎంపీటీసీ లు గ్రామ అధ్యక్షులు,వివిధ అనుబంధకమిటీఅధ్యక్షులు,రైతుసంఘాలనాయకులు, రైతులు పాల్గొన్నారు.
-----------------------
Admin