సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో శ్రీశ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నూతనంగా ఏర్పడినటువంటి కార్పెంటర్ యూనియన్ మొట్టమొదటి సమావేశం గౌరవాధ్యక్షులైన చేపూరి నరసింహ చారి,రాగి శ్రీనివాసచారి అధ్యక్షతన సమావేశంనిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలను కార్పెంటర్ యొక్క సమస్యలు ప్రస్తావించడం జరిగింది కార్పెంటర్లకు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కార్పెంటర్లు వలన లోకల్ కార్పెంటర్లకు పని లేక ఇబ్బంది పడుతున్నారు కార్పెంటర్లు కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నూతన ఏర్పడినటువంటి కార్పెంటర్ కి సభ్యత్వం తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వం పేద కార్పెంటర్లను ఆదుకోవాలని ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన కార్పెంటర్లకు ఇవ్వాలని రామస్వామి గుట్ట దగ్గర డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో అర్హులైన పేద కార్పెంటర్ లకు 50 సంవత్సరాల నిండిన ప్రతి కార్పెంటర్ వృత్తిదారునికి పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రతి కార్పెంటర్ ఏకతాటిపై నిలబడాలని సమావేశంలో తీర్మానించనైనది అనంతరం శ్రీ విఘ్నేశ్వర వుడ్ డిజైనింగ్ వర్క్స్ పి యశ్వంత్ ద్వారా టేపుల బహుకరణ జరిగింది ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు గోధురిబ్రహ్మచారి కార్యనిర్వాక అధ్యక్షుడు పెద్ద సూర్యనారాయణ చారి ప్రధాన కార్యదర్శి దేశ ఉపేంద్ర చారి కోశాధికారి రాగి రాజశేఖర్ దేవాలయ చైర్మన్ తాళ్లూరి హనుమాచారి, బంగారు బ్రహ్మచారి, శ్రీపాది రంగయ్య చారి, నాగాచారి, ఆనపు శ్రీనివాసచారి,మంగాచారి, రుద్రోజు శ్రీనివాసచారి, లింగగిరి దుర్గా, కేశవరపు బ్రహ్మచారి,చికాకుల అనిల్ హరీష్ చారి, శ్రావణి చారి, బ్రహ్మచారి, నరసింహ చారి, వెంకటాచారి, శ్రీనివాసచారి, చెల్లాల లక్ష్మణాచారి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin