సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్ అధ్యక్షతన అధికారులతో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈసందర్భంగా ఎంపీపీ పార్వతి కొండా నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, అందులో భాగంగా రైతు లకు రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ వంటి పథకాలు మరియు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ , ఆరోగ్యలక్ష్మి, కెసిఆర్ కిట్టు, మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వంటి పథకాలు అందిస్తున్నారని తెలియజేశారు.కెసిఆర్ తండాలను గ్రామపంచాయతీ లుగా గుర్తించారని, వాటికి కొత్త భవనాలను మంజూరు చేయించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో గుర్రంపోడు దగ్గర చెక్ డ్యాము నిర్మించి, భూగర్భ జలాలను పెంచారని, లిఫ్ట్ ద్వారా చివరి అయకట్టు వరకు రైతులకు నీరు అందుతున్నాయని తెలియజేశారు.ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో ఎస్ డి ఎఫ్ నిధుల ద్వారా గ్రామాలలో డ్రైనేజీలు సి.సి రోడ్లు వేశారని, సీఎం కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి ఎస్డిఎఫ్ నిధులు 10 లక్షల రూపాయలు మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఆ పనులకు త్వరలోనే ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తో శంకుస్థాపన చేస్తారని, నియోజకవర్గంలోని అన్ని మండలాల, గ్రామాల మరియు తండాల లింక్ రోడ్లకు 65 కోట్లు ఎమ్మెల్యే సైదిరెడ్డి కృషితో మంజూరయ్యాయని త్వరలో ఎమ్మెల్యే చే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు.వర్షాకాలం దృష్ట్యా గ్రామాలలో డ్రైనేజీలలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, విధి దీపాలు వెలిగేటట్లు చూడాలని, ప్రజలకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛ తా హీ పక్షోత్సవాలు గ్రామాల్లో జరుపుకోవాలని, మండలంలో అక్టోబర్ 1న స్వచ్ఛ తా హి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానకి రాములు, ఎంపీ ఓ ఆంజనేయులు, ఎంఈఓ ఛత్రు నాయక్, ఏపీవో ఉమా, ఏవో, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ నరసింహారావు నాగిరెడ్డి సైదమ్మ, ప్రభుదాసు, సైదా కుమారి కాశయ్య, సర్పంచ్ గోవిందు, ఐసిడిఎస్ అధికారి విజయలక్ష్మి, కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin