సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలోనే 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను, మహిళలను, యువకులను, నిరుద్యోగులను, వృద్ధులను ఇలా అన్ని వర్గాల ప్రజలను హామీలు ఇచ్చి మోసం చేసింది రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసింది రైతులకు రైతు భరోసాను ఎగగొట్టింది, యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వలేదు, పంటలకు సరిపడా యూరియాను అందివ్వలేదు రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా అందక పంటల దిగుబడి తగ్గింది చేతికివచ్చిన కొద్దిపాటి పంటలకు గిట్టుబాటు ధర లేదు ఇప్పటివరకు మాక్కలు ,పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు ఎన్నికలకు ముందు మహిళలకు 2500 మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసింది వృద్ధులకు నెలకు నాలుగు వేల పెన్షన్ ఇంట్లో అవ్వ తాతలకు ఇద్దరికి ఇస్తామని మోసం చేసింది నిరుద్యోగులకు, యువతి యువకులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు,స్కూటీలు ఇస్తామని మోసం చేసింది 22 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో హామీల అమలుపైన నిలదీయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు బాకీ కార్డు లో ఉన్న ప్రతి హామీని నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో ఓటు అడగాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రేపు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ లాంటివారు ఎన్నికలలో నిండా మునుగుడు ఖాయo ఈ కార్యక్రమంలో :-మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న ,మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్ . పిఎసిఎస్ చైర్మన్లు,చింతకింది వంశీ మురహరి రవి.మాజీ జెడ్పిటిసి పత్తి నాయక్ గారు,మాజీ ఎంపీపీ,మండల అధికార ప్రతినిది కంది కృష్ణ చైతన్య .మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు అనుముల కుమారస్వామి .అమ్మ రాజేష్. కొండవీటి ప్రదీప్ కుమార్ ,మండల ప్రధాన కార్యదర్శి భూక్య రవీందర్.డైరెక్టర్లు.ఉపాధ్యక్షులు, మండల కార్యదర్శులు, కార్యదర్శిలు, కోశాధికారి,మండల యూత్ ప్రెసిడెంట్,అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు,యూత్ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు ,మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు ,మాజీ వార్డు మెంబర్ లు,మండల నాయకులు, కార్యకర్తలు,పార్టీ నాయకులు ,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు....
-----------------------
Admin