సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ పాత జాతీయ రహదారి విస్తరణకు, పరిగి రోడ్డు మరమ్మతులకు సంబంధించి అన్ని నిధులు ఎమ్మెల్యే సహకారంతో మంజూరయ్యాయని, కేవలం వర్షాల కారణంతోనే రోడ్ల నిర్మాణం ఆలస్యం అవుతుందని మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ తెలిపారు. పాత జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి రహదారిని మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్ల విస్తరణకు, మరమ్మతులకు లకు కావాల్సిన అన్ని నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. త్వరలోనే అన్ని పనులు ప్రారంభమవుతాయి తెలిపారు. షాద్ నగర్ అభివృద్ధిలో భాగంగా వేసిన రోడ్లు కనిపించవు కాబట్టి స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్, బిజెపి నాయకుల నిరసనలు తెలుపుతున్నారని విమర్శించారు. గత వారం పైగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుంటే రహదారి విస్తరణ పనులు, రోడ్ల మరమ్మతులు చేయడం లేదని బిజెపి, కాంగ్రెస్ నాయకులు నిరసనలు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కురుస్తున్న కుండపోత వర్షంలో రోడ్ల విస్తరణ పనులు, మరమ్మతులు ఎలా చేస్తారో చెప్పాలన్నారు. ప్రజా క్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని, త్వరలోనే అన్ని రహదారులు నూతనంగా మారడం ఖాయమన్నారు.
-----------------------
Admin