సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలోని చేపూర్ గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల లో పేపాల్ ఫౌండేషన్ ప్రారంభం చేశారు. ఈ వర్క్ షాప్ ఫిబ్రవరి 24 వరకు జరుగుతుందని క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యం తెలిపారు. షాప్ ఫిబ్రవరి 24 వరకు జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ఐ సి టి అకాడమీకి చెందిన తెలంగాణ ఎడ్ గోపాల్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రధాన ఉపన్యాసం చేశారు. ఆయన ప్రసంగిస్తూ ఐటిసి పరిజ్ఞానంతో సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఉద్యోగాలు ఎలా పొందవచ్చు విద్యార్థులకు సోదరుహంగా వివరించారు. శిక్షణ కార్యక్రమంలో సెల్ఫో ఫోర్స్ టెక్నాలజీస్ టూల్స్ పై శిక్షణ ఇవ్వనున్నారు. విద్యా సంస్థ కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విద్యార్థులు ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ పట్ల లోతైన అవగాహనను పొందేందుకు, ఐ సి టి టెక్నాలజీ వంటి అంశాల పైన వర్క్ షాప్ ఉపయోగ పడతాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు క్షేత్రీయ కాలేజీలో నిర్వహిస్తున్నామని మార్కెట్లో క్షత్రియ విద్యా సంస్థల విద్యార్థులు సాంకేతికంగా వస్తున్న మార్పుల్ని ముందుగానే అంచనా వేయడంలో ముందుంటారని అన్నారు. ప్రిన్సిపాల్ రామ్ కింకర్ మాట్లాడుతూ ఐసీటీలో అనేక ఉద్యోగాలు ఏర్పడుతున్నాయని కాబట్టి విద్యార్థులు ఈ టెక్నాలజీని నేర్చుకోవాలని మరిచా పరిజ్ఞానం పొందాలని తద్వారా ఉద్యోగం పొందడం చాలా సుల భతరం అవుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఐ సి టి అకాడమీ నుండి ధీరజ్ సతీష్ కుమార్ లు గౌస్ భాషా శిక్షకులు ఒక వ్యవహరించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో టిపిఓ సునీల్ గట్టడి, వివిధ భాగాల అధిపతులు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దగ్గరుండి నిర్వహిస్తున్న గుడిమాల రాజు గారిని అల్జాపూర్ దేవేందర్ మరియు ప్రిన్సిపల్ కొనియాడారు.
-----------------------
Admin