సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణం కేంద్రంలో భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన భావితరాల వారికి ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ శ్రీ సత్య సాయి జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి,ఐహెచ్ఆర్ఏఏ ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి, MEPMA ఎసభ్యులు గౌస్ లాజమ్ కట్టుబడి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మున్సిపల్ ఉర్దూ పాఠశాల నందు జమాతే ఇస్లామీ హింద్, ఇటికల ఇలియాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆనందదాయకమని, స్వాతంత్ర కోసం ప్రాణ త్యాగాలు చేసి చరిత్ర పుటల్లో కనుమరుగైన ముస్లిం అమరవీరుల చరిత్రను వెలుగులోకి తీసుకొని వచ్చిన ప్రముఖ చరిత్రకారుడు,బహూ గ్రంధ రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ ను ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి భారత భూమిని రక్షించుకోవడం కోసం ఎంతో ధైర్య సాహసాలతో పోరాటం చేసి వారి జీవితాలను సైతం త్యాగం చేసిన ఎందరో మహనీయులు చరిత్రను మనందరికీ తెలియజేసిన సయ్యద్ నశీర్ అహమ్మద్ ను సన్మానించడం ఆనందదాయకమన్నారు. స్వాతంత్ర సమరయోధుల గురించి అవగాహన పెంచుకొని వారి అడుగుజాడల్లో నడవాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి రియాజ్ , టోపివలి,డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలాలి షేక్ , సాకే నరేంద్ర, రామకృష్ణ, ఈశ్వర్, శ్రీనివాసులు, యుటిఎఫ్ నాయకులు ఖాజా మొహియుద్దీన్, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin