సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అమడగూరు మండలం కొట్టువారిపల్లిలో "ఇదేమి కర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలనను అవలంబిస్తున్నారని, వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఎండగడతాం అని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన అమడగూరు మండలం కొట్టువారి పల్లి పంచాయితీలో కార్యకర్తలతో కలిసి ఇదేం కర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇంచార్జి నుంచి గ్రామ స్థాయి అధ్యక్షుడు వరకు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇవ్వటమే లక్ష్యంగా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఈ మూడున్నర సంవత్సరకాలంలో వైసీపీ చేసిన అక్రమాలు, పెరిగిన నిత్యావసర ధరలు, తెలుగుదేశం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులపై, అన్యాయాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు నుంచి వారి సమస్యలను తెలుసుకుంటూ మీకు అండగా నేను ఉంటానని వెన్ను తట్టి వారికి గట్టి భరోసా కల్పించారు. రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని రానున్న ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.
-----------------------
Admin