Monday, 27 July 2026 06:30:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి...

Date : 04 July 2023 07:32 AM Views : 443

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పుట్టపర్తి పర్యటన కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 3, 4వ తేదీలలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పుట్టపర్తిలో పర్యటిస్తుండగా, సోమవారం రాష్ట్ర గవర్నర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డితో కలిసి పరిశీలించారు. ముందుగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సమాధిని జిల్లా కలెక్టర్, ఎస్పీలు దర్శించుకున్నారు. అనంతరం ప్రశాంతి నిలయం, శాంతి భవన్ వద్ద, ఈనెల 4వ తేదీన రాష్ట్ర గవర్నర్ పాల్గొనే సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర గవర్నర్ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసుకోవాలని, గవర్నర్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నవీన్ కుమార్, సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :