సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన సామయ్య మృతి విషయాన్ని తెలుసుకున్న కేశంపేట జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ కొత్తపేట వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఎంపిటిసి దిద్దెల లక్ష్మమ్మలక్ష్మయ్య సామయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పంపిన రూ.5వేల నగదును సామయ్య కుమారుడు శేఖర్ కు అందజేసి మాట్లాడారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా సామయ్య అందించిన సేవలు గ్రామస్తులు మరిచిపోరన్నారు. గత 40ఏళ్లకు పైగా విద్యార్థులందరి మదిలో సామయ్య తాతగా ప్రసిద్ధిగాంచిన ఆయన మన మధ్య లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. భగవంతుడు సామయ్య కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి.రంజిత్ కుమార్, పాలబూత్ శ్రీనివాస్ రెడ్డి, శాంతయ్య, అంజయ్య, రాఘవేందర్, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin