సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, కేశంపేట్ మండల్ / తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు జరుపుకుంటున్న విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో సాధించిన పురోగతి మీద షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల కేంద్రంలోని కొత్తపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యా దినోత్సవం కార్యక్రమంలో కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ… మన ఊరు మారింది. మన బడులు మారుతున్నాయి. ‘మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి' ఆశయం. అందరికీ మెరుగైన విద్య అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సంకల్పానికి నిదర్శనం ఈ పథకం. దేశ చరిత్రలోనే అత్యధిక గురుకులాలు కార్పొరేట్ స్థాయి ప్రమాణాలకు చిరునామాలు. ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 25 వేల వ్యయం భారంగా కాదు.. బాధ్యతగా భావిస్తోంది మన ప్రభుత్వం. మన భావితరాలకు బంగారు బాటలేసే. ఈ మహాయజ్ఞంలో మేముసైతం అంటూ... మనసుపెట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సేవలు అందిస్తున్న ఉద్యోగులకు, యావత్ అధికార యంత్రాంగానికి.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేశంపేట్ ఎంపీపీ రవి యాదవ్, సర్పంచులు, స్కూల్ యజమాన్యం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin