సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో, సూపర్ బజార్ సెంటర్ దగ్గర నుండి గాంధీ మహాత్మునికి పూల దండలతో నివాళులర్పిస్తూ ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ ఈ దేశం మనదే ఈ దేశ ప్రజల క్షేమం మనదే కాబట్టి వారి సమస్యలు తెలుసుకోవడానికి భారత జూడో న్యాయ యాత్ర ప్రారంభించారు. దానికి సంఘీభావంగా భద్రాద్రి జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ ప్రేమను పంచడమే రాహుల్ కి తెలుసు కాబట్టి అరాచకాలను మతద్దేశాలను రెచ్చగొట్టే బి జి పి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ రాహుల్ గాంధీ భారత్ జూడో న్యాయ యాత్రను చేపట్టారు. ప్రజల విశేష ఆదరణ స్పందన ఓర్వలేక ప్రత్యక్ష దాడులకు పాల్పడ్డ బిజెపి గుండాలు, అయినప్పటికీ దేనికి భయపడకుండా విజయవుడై యాత్రను కొనసాగిస్తున్నారు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 12 రాష్ట్రాలు కవర్ చేస్తూ 136 రోజులు 3970 కిలోమీటర్ల దూరం భారత్ జూడో న్యాయాత్రను చేపట్టారు. దేశంలోని విభిన్న మతాల వారిని ఏకతాటికి తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో 15 రాష్ట్రాలు 110 జిల్లాలు 65 రోజులు 6700 కిలోమీటర్ల దూరం యాత్ర సాగుతుంది. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒకచోట అరాచకానికి గురవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలులు పాల్గొన్నారు...
-----------------------
Admin