సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, కేశంపేట్ మండల్ / తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలంలోని పాపిరెడ్డి గూడ గ్రామంలో పల్లె ప్రగతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ తెచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం యజ్ఞంలా సాగి, గ్రామాల రూపురేఖల్ని మార్చింది. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, చెత్త సేకరణకు ట్రాక్టర్, ట్రాలీ, హరితహారం కోసం ట్యాంకర్, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, డంప్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లతో పల్లెలు శోభాయమానంగా విలసిల్లుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి, డిప్యూటీ సర్పంచ్ అబ్బీ సుందరయ్య, స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ మనోహర్, గ్రామ సెక్రెటరీ, వార్డ్ మెంబర్ నరేందర్, రాంచందర్ నాయక్, పి లక్ష్మీనారాయణ, కే నర్సింలు, జంగయ్య, శంకరయ్య, లక్ష్మయ్య, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin