సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం మండల కన్వీనర్ షేక్ కాసింసా మాట్లాడుతూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు మన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని 2029 లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబోయే ముఖ్యమంత్రిగా చూడాలనే ధ్యేయంతో మనమందరం కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడి పని చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ షర్మిలమ్మ ను చేయాలనే ధ్యేయంతో మనమందరం పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి, జిల్లా కోఆర్డినేటర్, క్రాంతి శ్రీ ఆశ రెడ్డి, మహిళా కార్యకర్తలు, పి, మరియమ్మ, పి, అమల, బాల గురవమ్మ, తదితర పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు...
-----------------------
Admin