సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీలోని 25 వ వార్డులో కౌన్సిలర్ సాహెరా బేగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళా మణులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వార్డు ప్రథమ మహిళ ఆయన కౌన్సిలర్ సాహెరా బేగం ని మహిళలు సన్మానించుకున్నారు. తర్వాత ఆమె మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులుగా జీవించాలని అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వారి జీవనశైలిని గుర్తు చేసుకున్నారు. ఈ సమాజంలో అన్ని రంగాలలో మహిళలు ముందంజలో ఉన్నారని విద్యా, వైద్యం, స్పోర్ట్స్ రంగాలలో మహిళలు రాణిస్తున్నారని అన్నారు.
-----------------------
Admin