సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వైరా నియోజకవర్గ కేంద్రం లోని వైరా మండల కేంద్రము లో ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి ఐదవ రోజుకు చేరుకున్నాయి. జర్నలిస్టు చేపట్టిన రిలే దీక్షలు కు జిల్లా కాంగ్రెస్ కమిటీ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు ఎన్నో సందర్భాలలో కెసిఆర్ జర్నలిస్టులకు హామీలు ఇచ్చి అరిచేతులలో అస్త్రం చూపిస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. కెసిఆర్ మాటలు తప్ప చేతలు లేవు అన్ని అన్నారు. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్ని వర్గాలను ఆదుకుంటుంది కార్మికులను, కర్శకులను , ఫోర్త్ ఎస్టేట్ రంగంలో లో కష్టబడితున్న నిత్యం ప్రజల సమస్యలను ఎలికితిసే ప్రతి జర్నలిస్టును కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందాని దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి హరినాథ్, వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పమ్మి అశోక్, పల్లపు కొండలు, పనితి శ్రీను, వైరా మండల గిరిజన కాంగ్రెస్ అధ్యక్షులు గుగులోతు రాము, వేముల కుమార్, పువ్వాళ్ళ రాము, జిల్లా నాయకులు పాలకుర్తి నాగేశ్వరావు, మద్ది వీర రెడ్డి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin