సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై పోస్టర్లు ను సిఐటియు మండల అధ్యక్షులు కుల్లాయప్ప ,కార్యదర్శి శ్రీరాములు, సిఐటియు జిల్లా నాయకులు వివి రమణ, విడుదల చేశారు. శనివారం వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల పై పోలీసుల వేధింపులు ఆపాలి అక్రమంగా బనాయిస్తున్న 290 జీవోను రద్దు చేయాలని ఆటో డ్రైవర్లకు ఇల్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం అక్రమంగా వేస్తున్న ఈ చలానాలను రద్దు చేయాలి ఆటో డ్రైవర్ల పై ప్రస్తుతం ఉన్న ఈ చలానాలను రద్దు చేయాలి డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమలో ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు మహబూబ్ బాషా, రమేష్, మారప్ప, నరసింహులు, గంగాద్రి ,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin