సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులు వెంటనే చేపట్టాలని షాద్ నగర్ వైయస్సార్టిపి కో ఆర్డినేటర్ మహమ్మద్ ఇబ్రహీం డిమాండ్ చేశారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మించేంతవరకు పోరాటం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. శనివారం షాద్ నగర్ మహమ్మద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. జిల్లేడు చౌదరి గూడెం మండలం లక్ష్మీదేవి పల్లి రిజర్వాలను చేపడతామని చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పడం సిగ్గుచేటు అని అన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ చేపడితే రైతులకు సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ చేపట్టకపోతే ఓట్లు అడగనని కెసిఆర్ చెప్పిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్య తీర్చేంతవరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తప్పుడు నరసయ్య ఈదులపల్లి నరసింహ మనసాని రాంరెడ్డి షాద్ నగర్ టౌన్ ప్రెసిడెంట్ బషీర్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin