Sunday, 26 July 2026 03:51:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మీ పాలన రజాకార్లను తలపిస్తోంది...

Date : 30 October 2023 02:07 AM Views : 258

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ :కేసిఆర్ పాలన రజాకార్ల రాక్షసత్వాన్ని గుర్తు చేస్తున్నదని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సి. ప్రతాప్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పాలనలలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు నిజాం నియంత పాలనలా ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్ధి వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం కేశంపేట్ మండలం బైర్ ఖాన్ పల్లి, మంగళి గూడ, కొనియా పల్లి, సంతాపూర్, పాటిగడ్డ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, జడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు, నీటి ప్రాజెక్టులు. ప్రజలారా ఆలోచించండి. బైర్ ఖాన్ పల్లి, గ్రామంలో నిరుపేద, అర్హులకు ఒక్కరికైన దళిత బంధు, బీసీ బంధు, గృహాలక్ష్మి వచ్చిందా. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు అందిస్తాం. ప్రజల సొమ్మును దోచుకున్న టి ఆర్ ఎస్ నాయకులు మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడగడానికి సిగ్గు ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ జడ్పీటీసీ వెంకట్ రాం రెడ్డి, యాదయ్య యాదవ్, వీరేశం, జగదీశ్వర్, సురేష్ రెడ్డి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :