సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వార్ వన్ సైడ్ కాబోతుందని, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరో 20 మంది అగ్ర నాయకులు రాబోతున్నారని టిపీసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్ నగర్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. మంగళవారం కొల్లాపూర్ లో ఈ నెల 20న జరగనున్న ప్రియాంక గాంధీ భారీ బహిరంగ సభకు సంబంధించి వేదికను పరిశీలించారు. సుమారు 20 మందికి పైగా బడా నాయకులు ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. సభ స్థలాన్ని వేదికను పరిశీలించేందుకు అధిష్టానం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందని శంకర్ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టిఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. అన్ని వర్గాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయని శంకర్ అన్నారు. తాజాగా ఖమ్మం సభ కనివిని ఎరుగని రీతిలో జరిగిందని ఇప్పుడు అంతకుమించి కొల్లాపూర్ సభ జరగబోతుందని వీర్లపల్లి శంకర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎర్ర శేఖర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఉబేతుల్లా కొత్వాల్, అభిలాషరావు, దేవరకద్ర శ్రీహరి, తదితరులు ఉన్నారు.
-----------------------
Admin