సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : పత్రికా రంగంలో తనదైన ముద్రవేసిన (కె వై ఆర్) కందుకూరి యాదగిరి... తన విలక్షణమైన వ్యక్తిత్వంతో పాత్రికేయ వృత్తికె వన్నె తెచ్చారు. సూర్యాపేట జిల్లా నలుమూలల ఎక్కడ ఏ సమస్య పరిష్కారానికి అయినా సరే అట్టి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి అట్టి ప్రజా సమస్యలను తన పత్రికలో ప్రచురించి వెంటనే అట్టి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధుల ద్రృష్టికి తీసుకుని వెళ్లి ప్రజా సమస్యలనూ పరిష్కారించే దిశగా ఆయన కలం తుపాకీ తూటా మాదిరిగా గలమై గర్జించింది. ప్రజా స్వామ్యం పై ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలల కౌగిటిలో దాగివున్న కవితా కావ్యాలను కమ్మటి పరిమళాలతో వికసించింది.ఆనాడు సమాజంలో ఎక్కడో అద్దుమ రాత్రి చీకట్లో నలుమూలల జరిగిన ప్రతి ఒక్క సంఘటనలు ఎటువంటి జీతభత్యాలు లేకుండా ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా సమాజం కోసం ప్రతి ఒక్క వార్తను దినపత్రిక లో కవర్ చేస్తూ ఎన్నో రకాల కష్టాలు పడుతున్న ఏ ఒక్క ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సాధకబాధలు పట్టించుకునే నాథుడే లేడు అని తోటి పాత్రికేయ మిత్రుల శ్రమకు తగ్గ ఫలితం లేక ప్రతిభకు తగ్గ గౌరవం లేక ఉన్న స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో జర్నలిస్టుల పక్షాన నిలబడి వారి కోసం వారి పక్షాన పోరాటం చేసి జర్నలిస్టులకు సహాయసహకారాలు అందించాలనే ఒక దృడమైన సంకల్పంతో వారి పక్షాన నినదించింది ఆయన కలం ఆయన గలం ఆ నినాదమే తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు అసోసియేషన్ గా ఏర్పాటు చేయడం జరిగింది.ఇట్ఝి జర్నలిస్టుల అసోసియేషన్ అప్పటి నుంచి పాత్రికేయుల పక్షాన పని చేస్తుంది అని అలా పాత్రికేయుల పక్షాన నిలబడి జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ఆర్థికపరమైన ప్రశాంత జీవితం కొనసాగాలని అని ఇట్టి జర్నలిస్టుల తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ నిన్న నేడూ రేపు రాబోయే రోజుల్లో ఎల్లాప్పుడు నిరంతరము జర్నలిస్టుల కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల అభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడుతూనే ఉంటుంది అని తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులైన కందుకూరి యాదగిరి తెలియజేశారు. అంతేకాకుండా ఈ తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏ ఒక్క కులానికి కానీ..?ఏ ఒక్క జాతికి కానీ..? ఏ ఒక్క మతానికి కాదు అని, కుల మత ప్రాంత పార్టీ అనే తేడాలేకుండా యావత్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల అభివృద్ధి కోసం అనూనిత్యం పని చేస్తుంది అని టి ఎస్ జే ఏ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి అన్నారు.
-----------------------
Admin