సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వేంసూర్ గ్రామంలో, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని, నైజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ప్రాంతాలను, కట్టడాలను ,స్ఫూర్తి కేంద్రాలను సందర్శించాలనే కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం లోని వేంసూర్ గ్రామంలో 1927 లో నిర్మించిన పోలీస్ స్టేషన్ ను బిజెపి నాయకులు శుక్రవారం సందర్శిం చారు. ఆనాటి నిజాం కు వ్యతిరేకంగా గ్రామ రక్షక దళం అనే పేరుతో చాలామంది నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయటం జరిగిందని బిజెపి నాయకులు అన్నారు. నిజాం సైనికులు సాగించిన ఆకృత్యాలకు , ఆగడాలకు మానభంగాలకు, హత్యలకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేయడం జరిగిం దని వారు తెలిపారు.సాయుధ పోరాట యోధులను వేంసూర్ గ్రామంలో నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్లో బంధించి అనేక చిత్రహింసలకు గురి చేయటం జరిగింద ని అన్నారు. చాలామంది ఈ పోలీస్ స్టేషన్లోనే అసువులు బాసటం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం వేంసూరు గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్ మరియు ఆ స్థలాన్ని సాయుధ తిరుగుబాటుయోధులకు, గుర్తుగా , చిహ్నంగా, వారికి ఘన నివాళులర్పించేందుకు ఒక స్ఫూర్తి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని ఒక మంచి స్ఫూర్తి కేంద్రంగా తయారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు .రామలింగేశ్వర రావు, సీనియర్ నాయకులు దొడ్డపనేని .కృష్ణయ్య , వేంసూరు మండల ఉపాధ్యక్షులు మట్టా .ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin