సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వర్దా నియోజకవర్గం అభ్యర్థి పంకజ్ బోయర్ కు మద్దతుగా మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని కోరారు. తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడం లేదని ఆరోపించారు. బిజెపి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు తెలిపాలని అన్నారు. బిజెపి సర్కార్ మహారాష్ట్రలో రావడం ఖాయమని స్పష్టం చేశారు...
-----------------------
Admin