సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి ,శంబయపల్లి గ్రామాల అభివృద్ధి బాధ్యత తనదేనని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు దేశాయిపల్లిలో ఉత్తరేణి భాగ్యలక్ష్మి రాజబాబు నిర్వహించిన ఎన్నికల ప్రచారాల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత తన తీసుకుంటాన ని భరోసా ఇచ్చారు వారికి వచ్చినటువంటి గుర్తు ఉంగరం ఓటు వేసి భారీ మెజార్టీతోటి గెలిపిస్తే దేశాయిపల్లి, శంభాయిపల్లి గ్రామానికి బస్ సౌకర్యం కలిగిస్తానని మరియు అదేవిధంగా రోడ్లు, గ్రామానికి బాలవికాస ప్లాంటు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా శంబయపల్లె స్మశాన వాటిక వరకు రోడ్డు ఏపిస్తానని అదేవిధంగా స్మశాన వాటిక కాడ బోరు ఒక ట్యాంకు పెట్టిస్తానని హామీ ఇచ్చారు దేశాయిపల్లి నుండి దుబ్బ వరకు రోడ్డు అదేవిధంగా గ్రామానికి అభివృద్ధి తోడ్పడుతానని హామీ ఇచ్చారు అర్హులైన వారికి పింఛన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, చెన్నూరి కిరణ్ రెడ్డి, మండల నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొని విజయవంతం చేశారు.
-----------------------
Reporter