సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ప్రముఖ కాంట్రాక్టర్ గుగులోతు కిషోర్ ,బూర్గంపాడు అదనపు ఎస్సై నాగ బిక్షం ,కాపు సంఘం నాయకుడు వారాల వేణు పాల్గొన్నారు. నూతన సంవత్సర సందర్భంగా కేకును కట్ చేసి మిఠాయిలు అందరికీ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో జర్నలిస్టులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రముఖ కాంట్రాక్టర్ కిషోర్ తెలియజేశారు. అదరపు ఎస్సై నాగభూషణం మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో గొప్ప వారిని,వారి సేవలు అమోఘమని నూతన సంవత్సర సందర్భంగా వారికి ,వారి కుటుంబ సభ్యులు మంచి జరగాలని,బూర్గంపాడు మండలం లోని ప్రజలు కు శుభం జరగలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. కాపు సంఘం నేత వారాల వేణు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వ తప్పుగా ఒప్పులను ప్రజలందరికీ తెలియజేసే ఫోర్త్ ఎస్టేట్ గా నిలిచేటువంటి జర్నలిస్టులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో పిల్లాపాపలతో బూర్గంపాడు మండల ప్రజలు అందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేశారు .మండల వ్యాప్తంగా ఉన్నటువంటి తోటి జర్నలిస్టులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య అనుసంధానంగా పనిచేసే జర్నలిస్టులు అందరూ కూడా ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రజలకు వారిదిగా నిలువస్తూ ప్రభుత్వానికి నివేదించటమే పాత్రికేయుని వృత్తిని తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు. అనంతరం అతిధులకు జర్నలిస్టులు శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు సభ్యులు అందరూ పాల్గొన్నారు.
-----------------------
Admin