సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం.లోని గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను చేరుకొని, చైతన్య పరచాలన్న లక్ష్యంగా బిజెపి పార్టీ పిలుపు మేరకు గరిడేపల్లి మండలం రేగులగడ్డ తండా లోనీ బిజెపి కార్యకర్త ఇంట్లో ఉండి గావ్ చలో అభియాన్ (పల్లెకు పోదాం అభియాన్) కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకురాలు హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి చల్ల శ్రీలతరెడ్డి.ఇటి కార్యక్రమంలో శ్రీలతరెడ్డి గ్రామంలో పర్యటిస్తూ రోడ్లు మరియు మురికి కాలువల గురించి స్థానిక ప్రజలతో చర్చించారు, అంగన్వాడి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కలిసి వారికున్నటువంటి సదుపాయాల గురించి పరిశీలన చేసారు..నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని గ్రామంలో ఇంటింటికి తీసుకెళ్లే దిశగా గ్రామంలోని యువతను కలిసి నరేంద్ర మోడీ గురించి, వారు చేపట్టిన కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ప్రతిఒక్కరూ నమో యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా తెలియజేశారు.అదేవిధంగా రైతు సంఘాలతో, బిజెపి సీనియర్ నాయకులతో తదితరులతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి పరిశీలించారు.అనంతరం శ్రీలత రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలకు అందజేస్తున్నటువంటి పథకాల గురించి ప్రతి ఒక్కరు ఇంటింటికి తెలియజేయాలని, డ్వాక్రా మహిళలకు పొదుపు సంఘాల వారికి శ్రీనిధి లోన్లను అందజేయడంలో కేంద్ర ప్రభుత్వం రుణాలను అందిస్తుందని అన్నారు..గత ఎలక్షన్ లో జరిగినటువంటి లోటు పాటులు, 2024 లో జరగబోయే ఎలక్షన్లలో ఓటు శాతాన్ని పెంచే దిశగా ప్రతి ఒక్కరు తోడ్పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గరిడేపల్లి మండల అధ్యక్షుడు నర్సింగ్ అంజయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కుక్కడపు వేంకటేశ్వర్లు మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోతు చిరంజీవి, నేరేడుచర్ల కిషన్ మోర్చా అధ్యక్షుడు తాళ్ల నరేందర్ రెడ్డి, బిజెపి నాయకులు పోలిశెట్టి అంజయ్య, మండవ సత్యం, శంకర్ రెడ్డి, నాగిరెడ్డి, సురేష్, రమేష్, సైదులు, నాగార్జున్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin