సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని వర్కింగ్ ట్రైబల్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోతు రవీందర్ నాయక్ అన్నారు. మఠం పల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ఎంతో కాలం నుంచి జర్నలిజం వృత్తిగా భావించి విలేకర్లుగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ వృత్తి మీద ఇష్టంతో ఎంతోమంది సామాజిక సేవ లో భాగంగా ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలో నిరంతరం పనిచేస్తూ ఉన్నారని అన్నారు . హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని హుజూర్ నగర్ లో ఇటీవల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించిన విధంగానే మఠంపల్లి మండలంలో పనిచేస్తున్న విలేకరుల అందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించి, ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు లక్షల రూపాయల పథకాన్ని మంజూరు చేయించాలని కోరారు. మండలంలో అవసరమైన ప్రభుత్వ భూమి లభ్యం గాని పరిస్థితుల్లో నియోజకవర్గ కేంద్రమైన హుజూర్నగర్ లో అందరికీ ఒకే చోట ఇళ్ల స్థలాలను కేటాయించి జర్నలిస్టు కాలనీగా నామకరణం చేయాలని ఎమ్మెల్యేని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ లేని విధంగా హుజూర్నగర్ లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించి అందరికీ ఆదర్శంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి నిలవడం ఎంతో అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin