సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం : సూర్యాపేట ZP చైర్మన్, బీసీ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ కొడుకు పెళ్ళికి స్వచ్చందంగా 50 వేల మంది ప్రజలు రావడం, BRSలో BC లకు జరుతున్న అన్యాయాన్ని ప్రశ్నినించినందుకు అదేవిధంగా R.S. ప్రవీణ్ కుమార్ ను కలిసాడు అనే అక్కసుతో వట్టే జానయ్య యాదవ్ మీద BRS మంత్రి జగదీష్ రెడ్డి అక్రమంగా కేసులు పెడుతూ తీవ్రంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు.. అందువలన BSP రాష్ట్ర అధ్యక్షులు R.S. ప్రవీణ్ కుమార్ గారి పిలుపు మేరకు ఛలో సూర్యాపేట నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు... ఒక్క R.S.ప్రవీణ్ కుమార్ పిలుపుతో భయపడ్డ కెసిఆర్, BRS ప్రభుత్వం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది... KCR ప్రభుత్వం కుట్రపూరితంగా BSP నాయకుల అరెస్ట్ లను ఖండిస్తూ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ యాసం సిద్దార్థపూలే మాట్లాడుతూ.. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల BSP నాయకులను అరెస్ట్ ను ఖండిస్తూ తెలంగాణలో R.S. ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ BRS ప్రభుత్వం మరియు కాంగ్రెస్, బిజెపి పార్టీలు BC లకు చేస్తున్న మోసాన్ని, కుట్రలను అనుక్షణం బయటపెడుతూనే వాళ్ళ తరుపున బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ వారిని ఇంకా చైతన్యం చేస్తూ వారికీ జనాభా దామాషా ప్రకారం 60 నుండి 70 అసెంబ్లీ సీట్లు ఇచ్చి వారిని చట్టసభల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి మా నాయకుడు R.S. ప్రవీణ్ కుమార్ గారు శ్రీకారం చుట్టారు... ఈ సందర్బంగా BC నాయకులకు ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాం ఈ ఆదిపథ్య, అగ్రకులాల పార్టీలలో పనిచేస్తూ వారి కుట్రలకు బలికాకండి, తల్లి లాంటి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి అన్నదమ్ముల లాగా SC/ST/బీసీలం అంతా ఏకమై రాజ్యాధికారం సాధించుకొని జనాభా దామాషా ప్రకారం అభివృద్ధిలో ముందుకు సాగుదాం అని పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల అధ్యక్షులు తాటి ధనాకర్, మండల ఉపాధ్యక్షులు సువ్వా వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి చెన్నం రవి, మండల నాయకులు బోట కిరణ్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin