సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం ఎల్ ఐ సి ఏజెంట్ల జే ఏ సి ఆధ్వర్యంలో సత్తుపల్లి లో ఎల్ .ఐ.సి కార్యాలయం ముందు చేస్తున్న మెగా ధర్నా కార్యక్రమానికి టిపిసిసి అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్ల కువచ్చే ఆదాయం పై జి.ఎస్.టి పన్నును తొలగచాలని డిమాండ్ చేశారు.ఏజెంట్ల గ్రాట్యూటిని20లక్షలకి పెంచి పాలసీ దారుని బోనస్ పెంచాలన్న న్యాయ మైన డిమాండ్లను తక్షణమే కేంద్ర బిజెపి ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్.ఐ.సి సంస్థ దేశ వ్యాప్తంగా లాభాల బాటలో విస్తరించటానికి కీలకమైన ఎల్ .ఐ.సి ఏజెంట్ల వేదించొద్దని కేంద్రప్రభుత్వాన్ని మానవతారాయ్ హెచ్చరించారు.ఎల్.ఐ.సి ప్రభుత్వ రంగ సంస్థ ను ప్రైవేటు వ్యక్తులకి అమ్మేయటానికే ఏజెంట్ల కి కోతలు విధించే దిగజారుడు కార్యక్రమాల కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమం లో ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపిటీసి ఐ కృష్ణ,ఎల్.ఐ.సి.జెఏసి నేత కంభంపాటి కాంతారావు, సత్తుపల్లి పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫజల్ బాబా,సత్తుపల్లి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సమద్,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin