సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం : ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు ఏ ఒక్కరూ పాల్పడవద్దని మండల కేంద్రంలోని పెంట్లం పంచాయతీ లో రాజకీయ నాయకులకు, ప్రజలకు ఏర్పాటు చేసిన ఎలక్షన్ నియమావళి అవగాహన సదస్సులో సబ్ ఇన్స్పెక్టర్ షాహీన మాట్లాడుతూ సామాజిక మాధ్యమా లను వేదిక చేసుకుని వ్యక్తిగతంగా కానీ, రాజకీయంగా కానీ, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు కట్టుబడి పని చేయాలన్నారు. యాబై వేలకు మించి నగదు తీసుకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నగదుకు సంబంధించిన పత్రాలు ఉండాలని లేని పక్షంలో ఆ నగదుని సీజ్ చేస్తామన్నారు.అలానే గ్రామాల్లో ఎక్కడైనా గొడవలు అల్లర్లకు ఎవరూ పాల్పడవద్దని, ఒక వేళ ఎక్కడైనా గొడవలు జరిగితే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని, ఎలక్షన్ కు సంబంధించి ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోదలిస్తే సువిధ యాప్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు,అధికారులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సాహిన కానిస్టేబుళ్లు రాంబాబు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin