సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం లోని కాల్వపల్లి తండా గ్రామం, కొత్త దనబండ తండా గ్రామం, లాలితండ గ్రామం,లో రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామపంచాయతీ భవనాలు అంగన్వాడి కేంద్రాల ను ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను విడుదల చేయకుండా ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు పేర్లతో గ్రామపంచాయతీలకు నిధులను ప్రభుత్వం నుండి విడుదల చేయకుండా సర్పంచుల సొంత ఖర్చులతో పనులు చేయించి నిధులు విడుదల చేయకపోవడంతో కొంతమంది సర్పంచులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ఈ మండలంలో నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప మరే విధంగా అభివృద్ధి చెందలేదని గ్రామపంచాయతీ భవనానికి చుట్టు ప్రహరీ నిర్మాణానికి అయే ఖర్చులను ప్రభుత్వం నుండి త్వరలో విడుదల చేపిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు మండల నాయకులు అంగన్వాడీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు ....
-----------------------
Admin