సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం, కృష్ణ సాగర్ గ్రామపంచాయతీ పరిధిలో మణుగూరు - కొత్తగూడెం ప్రధాన రహదారి ప్రక్కన సర్వేనెంబర్ 10 గల ప్రభుత్వ భూమిలో గోదావరి ముంపు వరద బాధితులకు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని 144 రోజులు నుండి నిరసన నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పెద్దగోని ఆదిలక్ష్మి, జక్కం కొండలరావు, ముత్యాల సత్యనారాయణ, నిరుపేదల గృహకల్ప సాధన కమిటీ నాయకులు కొండపనేని కృష్ణయ్య, బండ్ల మునెమ్మ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin