సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉదయం కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించిన్నట్లు కర్ని గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంచార్జ్ డాక్టర్ తిరుపతయ్య తెలిపారు. శుక్రవారం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకొని అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులతో పాటు కంటి ఆపరేషన్ అవసరం అనుకున్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కె సి ఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలెంతలకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. కర్ని పి హెచ్ సి లలో శుక్రవారం 131 మందికి కంటి వైద్య పరీక్షలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అక్రమ్, ఉప సర్పంచ్ కృష్ణయ్య గౌడ్, డాక్టర్ నరేందర్, ఎ ఎన్ ఎమ్ చంద్రకళ , వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin